జోగులాంబగద్వాల జిల్లా డీఎస్పీ కార్యాలయంలో దళిత సంఘాల నేతలుమంగళవారం డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ, ఎస్టీ బాధితులకు కొన్ని నెలల నుండి నష్ట పరిహారం అందడం లేదని డీఎస్పీకి వినతిపత్రాన్ని సమర్పించారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ కేసులను త్వరితగతిన విచారించి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, అశోక్, తదితరులు పాల్గొన్నారు.