చెరువు గట్టున పడేసిన నవజాత శిశువు

64చూసినవారు
అప్పుడే పుట్టిన మగ శిశువును చెరువు గట్టున వేసిన దారుణ ఘటన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. దౌల్తాబాద్ మండలం గోకఫాసలాబాద్ గ్రామ శివారులోని తంగేడుకుంట వద్ద వాగులో అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు పడేశారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రవి గౌడ్, పోలీసు సిబ్బంది మృతశిశువును కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్