మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం పెద్ద రేవల్లిలో వ్యవసాయ పొలంలో విద్యుత్ తీగలు ప్రమాదభరితంగా ఉన్నాయి. వరి కోతలు కోసే సమయంలో ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. రాత్రి వేళలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ మార్గం గుండా వెళ్తే విద్యుత్ షాక్ కు గురై మరణించే అవకాశం ఉందని రైతులు అన్నారు. ప్రమాదభరితంగా ఉన్న విద్యుత్ తీగలను సంబంధిత అధికారులు స్పందించి సరిచేయాలని రైతులు కోరారు.