మహబూబ్ నగర్: భారత దేశ సైనికులకు సంఘీభావంగా ర్యాలీ

72చూసినవారు
ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత దేశ సైనికులకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో సంఘీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు కార్యక్రమాన్ని చేపట్టారు. ఫోరం సభ్యులు మాట్లాడుతూ. సైనికులు దేశ భద్రతకు ప్రాణాలు అర్పించేందుకు ముందుకు రావడం గర్వించదగ్గ విషయమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్