మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన టి. సత్యంగౌడ్, పుష్పలత దంపతుల కుమార్తె హన్సికకు ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన కూచిపూడి ప్రదర్శనలో కనబరిచిన ప్రతిభకు గానూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. ఈ సందర్భంగా స్థానిక ఎంజే ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ వారు విద్యార్థినిని బుధవారం శాలువాతో సత్కరించారు. ప్రతి విద్యార్థి చదువులోనే కాకుండా ప్రతి రంగంలో రాణించాలని, ఇలాంటి సత్కారాలు ఎన్నో అందుకోవాలని సూచించారు.