కంటైనర్ లో తరలిస్తున్న పశువుల పట్టివేత

62చూసినవారు
కంటైనర్ లో తరలిస్తున్న పశువుల పట్టివేత
కంటైనర్ లో తరలిస్తున్న పశువులను జడ్చర్ల పోలీసులు పట్టుకున్నారు. జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి వివరాలు మేరకు. ఆదివారం వాహన తనిఖీల్లో భాగంగా ఓ కంటైనర్ను తనిఖీ చేయగా సంగారెడ్డి నుంచి కర్నూలుకు ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా 24 ఎద్దులు, 4 దున్నపోతులను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఒకే కంటైనర్ లో 28 పశువులను తరలించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు సోమవారం సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్