కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ఆపి సింగరేణికి నేరుగా కేటాయించాలని శనివారం సాయంత్రం కల్వకుర్తి తహసీల్దార్ ఇబ్రహీం కు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా నాయకులు ఏపీ మల్లయ్య మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను కేంద్ర ప్రభుత్వం వేలం వేస్తు సింగరేణి కంపెనీ కూడా ప్రైవేట్ సంస్థలతో వేలం పాటలతో పోటీ పడాలని నిర్ణయించడం సరైంది కాదని అన్నారు.