ఉన్నతమైన చదువులతోనే విద్యార్థులకు ఉత్తమ గుర్తింపు లభిస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు మండలంలోని వివిధ పాఠశాలలకు సంబంధించి 10వ తరగతి పరీక్షలలో ఉన్నతమైన మార్కులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. విద్యార్థి దశలోనే క్రమశిక్షణ అలవర్చుకోవాలని తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఉన్నతమైన భవిష్యత్తు మార్గాలను ఎంచుకోవాలన్నారు.