నాగర్‌కర్నూల్‌: కొడుకును కాపాడి తల్లి మృతి

85చూసినవారు
నాగర్‌కర్నూల్‌: కొడుకును కాపాడి తల్లి మృతి
నాగర్‌కర్నూల్‌ (D), కోడేరు(M), రాజాపూర్‌ గ్రామంలో విషాదం నెలకొంది. వ్యవసాయ బావిలో తన కొడుకు భానుప్రకాశ్‌(9)కు ఈత నేర్పుతుండగా డబ్బాలకు కట్టిన తాడు ఊడిపోయింది. బాలుడు నీటిలో మునిగిపోతుండగా కాపాడాలని కేకలు వేశాడు. వెంటనే చెరువులోకి దూరిన తల్లి చంద్రమ్మ బావిలోకి దూకి బాలుడిని ఒడ్డుపైకి నెట్టి ప్రాణాలు కాపాడింది. ఆపై చంద్రమ్మ బయటకు వచ్చే క్రమంలో నీటిలో మునిగిపోయారు. చంద్రమ్మకు భర్త, కుమార్తె ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్