మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బొక్కలోనిపల్లిలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికాడు. అనంతరం తానూ సూసైడ్ చేసుకున్నాడు. సరిత, రాజేశ్ దంపతులు.. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వీరు దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో రాజేశ్ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.