వ్యక్తిగత కారణాలతో ఓ బీటెక్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ పండరి తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా బెల్లపల్లి ప్రాంతానికి చెందిన చీర సాయి ప్రకాశ్ (22) మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.