గొంతులో పూరీ ఇరుక్కుని యువకుడు మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని తిర్మలాపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. ఖానాపూర్ గ్రామానికి చెందిన బ్యాగరి కుమార్(25) తిరుమలాపూర్ రామ్రెడ్డి వద్ద పాలేరుగా పని చేస్తున్నాడు. ఇవాళ పొలం దగ్గర తను వెంట తెచ్చుకున్న పూరీలు తింటున్నాడు. మూడవ పూరీ తింటున్న సమయంలో అది గొంతులో ఇరుక్కోవడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.