కృష్ణ మండలం తంగిడి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నూతన పంచాయతీ భవనాలను నిర్మిస్తామని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని అన్నారు.