వరి ధాన్యం అక్రమంగా రాష్ట్రంలోకి రాకుండా ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీఐ రామ్ లాల్ అన్నారు. శనివారం కృష్ణ వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు. కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే లారీలు, బొలెరో వంటి పెద్ద వాహనాలను తనిఖీ చేయాలని అన్నారు. వాహనాల వివరాలను రికార్డులో నమోదు చేయాలని చెప్పారు. వరి ధాన్యంతో వచ్చే వాహనాలను అనుమతించవద్దని సూచించారు.