
భారత్-పాక్ యుద్ధం.. తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, శంషాబాద్ ఎయిర్పోర్టు, కూకట్పల్లి, నాంపల్లి, హైదరాబాద్ బస్స్టేషన్, టాంక్బండ్.. ఏపీలోని తిరుమల, విశాఖపట్నం RK బీచ్, విజయవాడ రైల్వేస్టేషన్, MG రోడ్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. హైదరాబాద్ మొత్తం అలర్ట్ జోన్లో ఉంది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్నే నమ్మాలని పోలీసులు సూచిస్తున్నారు.