ఉట్కూర్ మండలం పగిడిమర్రి గ్రామానికి చెందిన అశాభి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్య ఖర్చుల కొరకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 5 లక్షల విలువైన ఎల్వోసి పత్రాన్ని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందించారు. మెరుగైన వైద్యం చేయించాలని చెప్పారు. నాయకులు పాల్గొన్నారు.