Top 10 viral news 🔥

పెళ్లయిన మూడు రోజులకే ఆర్మీ పిలుపు.. జవాన్ ఏం చేశాడంటే?
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఓ భారత జవాన్ కు అనుకోని పరిస్థితి ఏర్పడింది. ఆ జవాన్ కు పెళ్ళైన మూడు రోజులకే ఎమర్జెన్సీ కాల్ రావడంతో బార్డర్ కు వెళ్లిపోయారు. మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ కు ఈనెల 5న వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆర్మీ నుంచి కాల్ రావడంతో ఆయన భార్య ను వదిలి బార్డర్ కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో మనోజ్ భార్య యామిని ‘నా సిందూరాన్ని దేశ రక్షణ కోసం బార్డర్ కు పంపుతున్నా' అంటూ ఆయనను సాగనంపింది.