అమ్రాబాద్ మండలంలో ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోసం శుక్రవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ హెలిప్యాడ్ కోసం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. జిల్లా అధికారులు తగిన ఏర్పాటు చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.