

VIDEO: 400 డ్రోన్లతో పాకిస్తాన్ దాడి.. నేలమట్టం చేసిన భారత్
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వేళ పాకిస్తాన్ ఇండియాపై గురువారం రాత్రి ప్రతీకార దాడులకు పాల్పడింది. పాకిస్థాన్ భారత్ పై భారీ దాడికి ప్రయత్నించినట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. 400 డ్రోన్లతో సియాచిన్ నుంచి కచ్ వరకు 36 ప్రాంతాల టార్గెట్ చేసుకుని డ్రోన్లను లాంచ్ చేయడంతో వాటిని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నాయి. ఈ డ్రోన్లకు కెమెరాలను పెట్టారని, ఇక్కడి సమాచారాన్ని సేకరించేలా పాక్ కుట్ర పన్నినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.