నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. నేను ఒక డాక్టర్ ను వైద్యానికి వచ్చిన రోగుల పరిస్థితి ఏమిటో తనకు తెలుసన్నారు. వైద్యానికి వచ్చిన వారందరికీ చికిత్సలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా పాలన అని అందరికీ తెలుసు అన్నారు.