నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గోరిట గ్రామంలో అత్యధికంగా 42 మంది జవాన్లు ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఇటీవల పలువురు జవాన్లు సెలవులపై ఇంటికి వచ్చారు. అయితే పాకిస్థాన్తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వెంటనే విధుల్లోకి చేరాలని ఉన్నతాధికారుల నుంచి సందేశాలు వచ్చాయి. దీంతో హడావుడిగా దేశ సరిహద్దులకు బయలుదేరి వెళ్లారు. జమ్మూకశ్మీర్, పంజాబ్, గుజరాత్, అస్సాంలో వారు విధులు నిర్వహిస్తున్నారు.