తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఉదయం కూడా పలుచోట్ల వర్షాలు నమోదైనట్టు అధికారులు తెలిపారు.