అమ్రాబాద్ మండలం దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ, టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి బుధవారం నిర్వహించారు. ప్రమాదం జరిగిన రోజు నుండి నిర్విరామంగా టన్నెల్ లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు జరుగుతున్న సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని, ఇంకా 50 మీటర్ల పొడవు, 3 మీటర్ల ఎత్తు మేర సహాయక చర్యలు చేపట్టాలని తెలియజేశారు.