
ఏపీ లిక్కర్ స్కాం.. ముగిసిన ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణ
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల విచారణ ముగిసింది. సిట్ అధికారులు వారిని ఆరు గంటలకుపైగా విచారించారు. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను వేర్వేరుగా ఉంచి సిట్ అధికారులు విచారణ చేశారు. ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని అధికారులు వారికి వెల్లడించారు.