నారాయణపేట కలెక్టరేట్ లో శనివారం ప్రొఫెసర్ చంద్ర మహలోనోబిస్ జయంతి సందర్భంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా ప్రొఫెసర్ చంద్ర మహలోనోబిస్ చిత్రపటానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను, 2వ పంచవర్ష ప్రణాళికలో ఆయన పాత్రను కొనియాడారు. గణాంక దర్శిని పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. అధికారులు పాల్గొన్నారు.