వ్యవసాయంలో రైతులు నూతన పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు పొందాలని కలెక్టర్ సిక్తా పట్ నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట మండలం చిన్నజట్రం గ్రామ రైతు శివరాజ్ పొలంలో సాగు చేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పచ్చిరొట్ట పంట వలన కలిగే లాభాలను తెలుసుకున్నారు. ఇతర రైతులు పండిస్తున్న పత్తి, కంది, పెసర పంటలను పరిశీలించి, దిగుబడి, లాభాలు గురించి అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.