ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు కొల్లంపల్లి వాగు ఉధృతంగా ప్రవహించింది. దింతో నల్లగుట్ట తాండా, మాల్యా తాండా ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటం చేత ఎక్కడి ప్రజలు అక్కడే నిలిచిపోయారు. వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని తాండా ప్రజలు, రైతులు కోరుతున్నారు. భక్తి వర్షాలు పడిన ప్రతిసారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని కోరారు.