
పాక్ దాడిలో చనిపోయిన పౌరుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
ఆపరేషన్ సిందూర్తో భారత్ పాకిస్థాన్లోని ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో దాయాది దేశం తట్టుకోలేకపోతుంది. వరుసగా సరిహద్దుల్లో దాడులకు తెగబడుతోంది. ఈ మేరకు జమ్మూకశ్మీర్లో పాక్ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి సహా ఐదుగురు పౌరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.