భారత రక్షణ రంగం ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు శుక్రవారం కోయిలకొండ మండలం గార్లపాడు మండల సాధన సమితి సభ్యులు సంఘీభావం తెలిపారు. సాధన సమితి కో కన్వీనర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ. త్రివిధ దళాలకు అండగా ఉంటామని చెప్పారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను అంతం చేయాలని అన్నారు. ఉగ్రవాదుల అనే పదం లేకుండా తూడ్చివేయాలని కోరారు. కార్యక్రమంలో సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు.