పోలీసులు ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలని ఎస్పీ యోగేష్ గౌతం అన్నారు మంగళవారం మరికల్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, సిబ్బంది వుంటున్న గదులను పరిశీలించారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను, దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.