ముత్తు పదార్థాల నివారణకు శుక్రవారం మరికల్ మండల కేంద్రంలో నార్కోటిక్స్ స్నైపర్ జాగిలాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కిరాణా దుకాణాలు, ఫర్టిలైజర్ షాపులు, ఆర్టీసీ బస్టాండ్, పాన్ షాపులు, అనుమానం వున్న పంట పొలాలు, తోటలలో జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.