ఎయిడ్స్ మహమ్మారి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సాయిరాం అన్నారు. నారాయణపేట మండలం సింగారం గ్రామంలో బుధవారం సంపూర్ణ సురక్ష కేంద్రం, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. దాదాపు 100 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మంజూర్ అహ్మద్, సుధాకర్ బాబు, మెనేజర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.