నారాయణపేట: ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి

84చూసినవారు
నారాయణపేట: ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి మొత్తం నాలుగు అర్జీలు అందినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్