విద్యార్థుల ఆరోగ్య సమాచారం కొరకు ఐడి కార్డులు ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో వైద్య, విద్యా శాఖ అధికారులతో ఆర్ బి ఎస్ కె కార్యక్రమాల విస్తరణపై సమావేశం నిర్వహించారు. మొబైల్ టీమ్ లు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయాలని, తద్వారా ఆరోగ్య సమస్యలు పరిష్కరించవచ్చు అని చెప్పారు. రెండు శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు.