
మహిళపై టిన్నర్ పోసి నిప్పంటించిన తాగుబోతు
కేరళ కాసర్గోడ్ జిల్లా మన్నడుక్కంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని రామామృతం అనే వ్యక్తిపై ఓనర్కు పక్క పోర్షన్లో ఉండే రమిత ఫిర్యాదు చేసింది. ఇల్లు ఖాళీ చేయాలని రామామృతాన్ని ఓనర్ హెచ్చరించాడు. దీంతో రమితపై నిందితుడు కక్ష పెంచుకున్నాడు. ఏప్రిల్ 8న పెయింట్ టిన్నర్ పోసి నిప్పంటించాడు. చికిత్స పొందుతూ రమిత మంగళవారం చనిపోయింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.