నారాయణపేట: రక్తదాన శిబిరం ప్రారంభించిన ప్రిన్సిపల్

67చూసినవారు
నారాయణపేట: రక్తదాన శిబిరం ప్రారంభించిన ప్రిన్సిపల్
ఒకరి రక్తదానం తో ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు అని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్ కిషన్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్బంగా గురువారం నారాయణపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అసుపత్రిలో రోగులకు అందించే వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకమని అన్నారు. నర్సు లేని ఆసుపత్రి ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సులు, వైద్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్