నారాయణపేట: చెక్ పోస్టు తనిఖీ చేసిన ఎస్పీ

74చూసినవారు
నారాయణపేట: చెక్ పోస్టు తనిఖీ చేసిన ఎస్పీ
వాహనాల ద్వారా వరి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా నారాయణపేట మండలం జలాల్ పూర్ గ్రామం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును శుక్రవారం ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల వివరాలు నమోదు చేసే రిజిస్టర్ ను పరిశీలించారు. సిబ్బందికి భద్రతాపరమైన సలహాలు, సూచనలు చేశారు. పకడ్బందీగా విధులు నిర్వహిస్తూ కర్ణాటక నుండి వరి ధాన్యం రాకుండా అడ్డుకోవాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్