హనుమాన్ జయంతి పురస్కరించుకొని శనివారం జిల్లాలోని అన్ని వైన్స్ దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, పర్మిట్ రూమ్ లను మూసి వేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బంద్ పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వైన్స్ దుకాణాలు మూసి వేస్తున్నట్లు చెప్పారు.