పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ యోగేష్ గౌతం అన్నారు. బుధవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ హల్ హక్ తో కలిసి పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రతినిధుల రక్షణ కొరకు పర్సనల్ సెక్యూరిటీ అధికారులను నియమించడం జరుగుతుందని వారికి రక్షణ కల్పించే బాధ్యత అధికారులదే అని అన్నారు.