నారాయణపేట జిల్లా కేంద్రంలో అశోకినగర్కి చెందిన యూసుఫ్ తాజ్ అనే వ్యక్తి కిరాణా షాప్లో టాస్క్ఫోర్స్, నారాయణపేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.16,368 విలువ గల ప్రభుత్వ నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లను పట్టుకొని సీజ్ చేశారు. అనంతరం యూసుఫ్ తాజ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.