రక్తదానం మహాదానం అని, రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నరేష్ అన్నారు. శనివారం నారాయణపేట పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్వామి వివేకానంద మున్సిపల్ పార్క్ వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒకరి రక్తదానం ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుందని అనారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.