ఎస్బిఐ నూతన ఛైర్మన్ గా పాలమూరు బిడ్డ చల్లా శ్రీనివాసులుశెట్టి నియమితులు కాబోతున్నారు. గద్వాల జిల్లాకు చెందిన శ్రీనివాసులు ప్రతిష్ఠాత్మకమైన ఎస్బిఐ ఛైర్మన్ పదవిని అధిరోహించడం ఒక మహత్తర సందర్భమని ఆదివారం సిఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కొత్త భాద్యతల్లో మరెన్నో విజయాలు, ప్రశంసలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఎస్బిఐ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్న శెట్టి ఛైర్మన్ గా ఆగస్టులో బాధ్యతలు స్వీకరిస్తారు.