వనపర్తి జిల్లా & మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన నలుగురి వ్యక్తుల సెల్ ఫోన్లను సీఈఐఆర్ కోడ్ ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి తెలిపారు. బుధవారం స్వాధీనం చేసుకున్న ఫోన్లను బాధితులకు అందజేశామన్నారు. ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ తమ తమ సెల్ ఫోన్లను, ల్యాప్ టాప్లను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు.