వనపర్తి నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులకు రూ. 1659. 28 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి తూడి మేఘా రెడ్డి ప్రతిపాదనలు అందజేశారు. గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని, ప్రభుత్వం నుంచి మంజూరయ్యే నిధుల ద్వారా విద్య, వైద్యం, రోడ్లు, భవనాలు, సాగునీటి కాలువల మరమతుల పనులకు వినియోగించనున్నట్లు తెలిపారు.