దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

568చూసినవారు
దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్ట తిరుమల కాలనీలోని శ్రీ శివ రామాంజనేయ స్వామి దేవాలయాన్ని బుధవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సందర్శించారు. రానున్న శ్రీ రామనవమి సందర్భంగా ఆలయంలో సీతారాముల కళ్యాణం సంబంధిత పనులు ఏ విధంగా జరుగుచున్నాయని అని అడిగి వివరాలు తెలుసుకున్నారు. గుడి నిర్మాణం అసంపూర్తిగా ఉన్నందున ఎమ్మెల్యే నిధులను మంజూరు చేయించి దేవాలయాన్ని సంపూర్ణంగా నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్