వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో తూడి మేఘారెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు శనివారం ఎమ్మెల్యే తూడి శ్రీనివాస్ రెడ్డి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేయాలని, ఓటమి గెలుపునకు నాంది కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.