
ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ట్వీట్ తొలగించిన కంగనా రనౌత్
భారత్లో ‘యాపిల్’ తయారీ కార్మాగారాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడుతూ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. ఆయనను ప్రధాని మోదీతో పోలుస్తూ ట్వీట్ చేశారు. అయితే, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు దాన్ని డిలీట్ చేశానంటూ అనంతరం మరో ట్వీట్ చేశారు. 'యాపిల్' తయారీ ప్లాంట్లను భారత్కు తరలించవద్దని టిమ్ కుక్కు సూచించానంటూ డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే.