పాలీసెట్ కౌన్సిలింగ్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15 లోపు ఫీజు చెల్లించాలని శనివారం వనపర్తి జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. 16 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. అలాట్ మెంట్ లెటర్ పేర్కొన్న విధంగా ధ్రువపత్రాలను అందించాలని అన్నారు. జులై 18నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.