వనపర్తి జిల్లాలో ఓ కౌలు రైతు ఆవేదన

71చూసినవారు
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం గుంటిపల్లి గ్రామానికి చెందిన ఓ కౌలు రైతు ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పంట వేశాడు. కౌలుకు తీసుకున్న పంట ఎండిపోతోందని రైతు వెంకట నాని కాపాడాలంటూ బుధవారం తన ఆవేదనను వ్యక్తం చేశాడు. పంట చివరి దశలో ఉండగా జూరాల ఎడమ కాలువ నుంచి సాగు నీరు ఆగిపోయింది. మరో రెండు తడులు నీరు వస్తే గాని పంట చేతికి రాదని ఇప్పుడు ఏమి చేయాలో పాలు పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. జూరాల నీటిని వదలాలని కోరాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్