తిరుమలయ్య గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని వినతి

60చూసినవారు
తిరుమలయ్య గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని వినతి
వనపర్తి జిల్లా సమీపంలోని తిరుమలయ్య గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బచ్చు రాము ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. గుట్టపై కొలువైన తిరుమలనాథుడి ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని, కళ్యాణ మండపం, పార్కు ఏర్పాటు చేయాలన్నారు. సమీపంలోని ఎక్స్ రోడ్డులో 58అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుకు 5 కుంటల ప్రభుత్వ స్థలం ఇప్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్